తాళ్లచేరుకట్టను పరిశీలించిన మడవేని నరేష్
NEWS Jul 25,2026 11:59 am
కోరుట్ల పట్టణంలో రూ.2 కోట్లతో మినీ ట్యాంక్బండ్గా అభివృద్ధి చేస్తున్న తాళ్లచేరుకట్టను ఎండోమెంట్ ధార్మిక సెల్ జిల్లా కన్వీనర్ మడవేని నరేష్ సందర్శించారు. కట్ట వెడల్పు చేసినప్పటికీ గంగమ్మ దేవాలయం ఎదుట రహదారి ఇరుకుగా ఉండటాన్ని గమనించి, ఆ ప్రాంతాన్ని కూడా విస్తరించాలని కాంట్రాక్టర్ను కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శులు చెట్లపెల్లి సాగర్, మ్యాకాల గణేష్, యువ మోర్చా అధ్యక్షుడు దమ్మ సంతోష్ రెడ్డి పాల్గొన్నారు.