విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలి
NEWS Jul 25,2026 12:00 pm
ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు దృష్టి సారించాలని తెలంగాణ రాష్ట్ర సీఎస్ సంజయ్ జాజు సూచించారు.సంజయ్ జాజు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హనుమకొండ జిల్లా కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ పాల్గొన్నారు.ప్రభుత్వ పాఠశాలలు,విద్యార్థుల యూనిఫామ్ కుట్టు పనులు,తాగునీరు,విద్యుత్, మౌలిక సేవలపై ఆరా తీశారు.ప్రభుత్వ పాఠశాలలో ఏలాంటి ఇబ్బందులు లేకుండా విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించాలన్నారు.