యూనిఫామ్ల తయారీ పూర్తి చేయాలి
NEWS Jul 25,2026 12:00 pm
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫామ్ల తయారీని వెంటనే పూర్తి చేసి పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో వాతావరణ పరిస్థితులు, పంటల సాగు, భూగర్భ జలాల సంరక్షణపై సమీక్షించారు. జలసిరి పనులు వేగవంతం చేయాలని, ఈ నెల 27 నుంచి 29 వరకు ప్రతి మండలంలో విత్తన మేళాలు నిర్వహించాలని సూచించారు.