నాగర్ కర్నూల్ జిల్లా విపనగండ్ల గ్రామంలోని 32 ఎకరాల దేవుని మాన్యం భూములను ఒకే కుటుంబం ఆ గుత్తాధిపత్యం నుండి విడిపించి, గ్రామ ప్రజలకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో విపనగండ్లభారీ ధర్నా నిర్వహించారు. రాజ్యాధికార పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజ మాట్లాడుతూ విపనగండ్ల గ్రామంలో వందేళ్లుగా సాగుతున్న భూ దౌర్జన్యాన్ని తాము సహించేది లేదని తీవ్రంగా హెచ్చరించారు.