దీక్ష ముగించిన సోనమ్ వాంగ్ చుక్
NEWS Jul 24,2026 11:01 am
పేపర్ లీకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇవ్వడంతో సామాజిక కార్యకర్త సోనమ్ వాంగుచుక్ తన నిరాహార దీక్షను విరమించారు. 26 రోజులుగా దీక్ష చేసిన ఆయన.. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత కేంద్రమంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సమక్షంలో దీక్షను ముగించారు.ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. సోనమ్ కు ప్రత్యేక సందేశం పంపారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.