విద్యార్థులు, యువతపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న అణచివేత విధానాలు, ప్రజాస్వామ్య హక్కుల హరణకు నిరసనగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో అంబేద్కర్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడం ప్రతి ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. యువత అభిప్రాయాలను గౌరవించి, వారి గొంతును అణిచివేసే ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల తరఫున పోరాడుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.