ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారా?
NEWS Jul 23,2026 12:45 pm
దేశంలో తీవ్ర వివాదాస్పదంగా మారిన నీట్ పేపర్ లీకేజీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలింది. ఈ మేరకు ఆయన పేరుతో చెలామణి అవుతున్న ఒక లేఖ కేవలం నకిలీదని ప్రభుత్వం తెలిపింది.