పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దురదృష్టకరం: ఎమ్మెల్యే
NEWS Jul 23,2026 05:26 pm
ఛలో లోక్ భవన్ కార్యక్రమంలో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో ప్రధానమంత్రి నివాసం వద్ద కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులు, కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీపై పోలీసుల దాడి ప్రజాస్వామ్యంపై దాడే అని అన్నారు.