కుటుంబాన్ని బంధించి భారీ దోపిడీ
NEWS Jul 22,2026 01:16 pm
కరీంనగర్ పట్టణంలో మళ్లీ భారీ దోపిడీ జరిగింది. భగత్ నగర్ ప్రాంతంలో ఓ ఇంట్లోకి చొరబడిన ముఠా, కుటుంబ సభ్యులను కత్తులు, రివాల్వర్లతో బెదిరించి 66 తులాల బంగారం, 21 లక్షల నగదు, విలువైన వస్తువులను దోచుకెళ్లింది. 8 మంది సభ్యులున్న ముసుగు ముఠా ఈ దోపిడీకి పాల్పడింది. ఇంటి యజమాని అజ్మత్ అలీతో పాటు కుటుంబ సభ్యులను తీవ్రంగా కొట్టారు. అనంతరం అజ్మత్ అలీ భార్య, ఇద్దరు కుమార్తెలపై కూడా దాడి చేశారు. ఎవరైనా కేకలు వేస్తే చంపేస్తామని కత్తులు, రివాల్వర్లతో బెదిరించారు.