'తల్లికి వందనం' నిధులు విడుదల
NEWS Jul 22,2026 01:50 pm
ఏపీ ప్రభుత్వం 'తల్లికి వందనం' పథకం నిధులను విడుదల చేసింది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 42.70 లక్షల మంది తల్లుల బ్యాంక్ ఖాతాల్లో మొత్తం రూ.10,120.78 కోట్లను ప్రభుత్వం జమ చేస్తుంది. అర్హులైన ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో రూ.13,000 చొప్పున చేరుతుండగా, ఈ ఆర్థిక సహాయ ప్రక్రియ ఈ నెల 24 వరకు కొనసాగనుంది.