తాగునీటి సమస్యలు లేకుండా చర్యలు: కలెక్టర్ భవేశ్ మిశ్రా
NEWS Jul 22,2026 01:19 pm
కుంటాల మండలం అంబుగాం గ్రామంలో కలెక్టర్ భవేశ్ మిశ్రా పర్యటించారు. గ్రామంలోని తాగునీరు, విద్యుత్, టెలికాం సేవలు, మౌలిక సదుపాయాలపై ప్రజలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి రైతు ఫామ్ పాండ్ నిర్మించుకోవాలని, భూగర్భ జలాల సంరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.