ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసు షీ టీమ్స్ కి బదిలీ
NEWS Jul 22,2026 12:06 pm
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసును అధికారులు ఉమెన్ సేఫ్టీ వింగ్కు బదిలీ చేశారు. ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు తదుపరి దర్యాప్తును షీటీమ్స్కు అప్పగించారు. షీటీమ్స్ డీసీపీ లావణ్య నాయక్ జాదవ్ పర్యవేక్షణలో ఈ కేసు విచారణ కొనసాగనుంది. ఈ ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు, అందుబాటులో ఉన్న ఆధారాలు, సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలను సమగ్రంగా పరిశీలిస్తారు.