బంగారం, వెండి ధర పెరుగుతోంది
NEWS Jul 22,2026 12:03 pm
పశ్చిమాసియా సంక్షోభం తర్వాత మార్కెట్లో బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఇరాన్పై అమెరికా దాడులు, ద్రవ్యోల్బణ భయాలతో ఈ లోహాలకు గిరాకీ ఏర్పడింది. దీంతో వీటి ధరలు పెరుగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బుధవారం ఉదయం 10 గ్రాముల మేలిమి 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,400కు చేరింది.మంగళవారంతో పోలిస్తే దాదాపు రూ.2వేలు పెరగింది. వెండి ధర కూడా పెరిగి.. రూ.2.26లక్షలుగా కొనసాగుతోంది.