MJPVC మహిళా అధ్యక్షురాలిగా పద్మ
NEWS Jul 22,2026 01:18 pm
మక్తల్ రాఘవేంద్ర కాలనీలో MJPVC మహిళా విభాగం అధ్యక్షురాలిగా పద్మను నియమించారు. MJPVC నారాయణపేట జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి విజయకుమార్ ఆమెకు శాలువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. MJPVC బలోపేతానికి పద్మ కృషి చేయాలని ఆకాంక్షించారు. MJPVC నాయకులు అంజి, శివశంకర్, కొత్తపల్లి ఆంజనేయులు, ఉజ్జెల్లి, కలబంద బస్వారాజ్, ఓబులేసు, నరసింహ, రామ, కేవీ నరసింహ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.