నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై విద్యార్థులు ఆందోళన చేస్తున్న సమయంలో విపక్షాలు కూడా ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు ప్రధాని మోదీ నివాసాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. రాహుల్, ప్రియాంకా గాంధీ సహా ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ తదితరులు ప్రధాని నివాసం ముందు బైఠాయించి నిరసన తెలిపారు.