ఉత్తరాంధ్రలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి భూములిచ్చిన రైతులకు అరుదైన గౌరవం దక్కనుంది. విమానాశ్రయానికి భూములు ఇచ్చిన రైతులు, యజమానులను గౌరవించేలా వారికి ఒకసారి ఉచిత విమాన ప్రయాణ అవకాశం కల్పించాలని సీఎం చంద్రబాబు విమానాశ్రయం అధికారులను ఆదేశించారు.