వెయ్యి కోట్ల రూపాయల విలువైన భూములపై ఈరోజు మీకు చట్టబద్ధమైన హక్కులు కల్పిస్తున్నాం అన్నారు మంత్రి లోకేష్.మంగళగిరి నియోజకవర్గంలో ఇకపై ఈ భూమిని బ్యాంకులో తనఖా పెట్టి కుటుంబ అవసరాలకు రుణం పొందవచ్చు. ఎవరూ వచ్చినా మీ భూమిని లాక్కోలేరు. ఈరోజు 3 వేల మందికి శాశ్వత ఇళ్ల పట్టాలు అందజేస్తున్నాం. దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలు తమ ఇళ్లు, స్థలాలను ఎవరైనా లాక్కుంటారేమోననే భయంతో జీవించారు. ఈరోజుతో ఆ భయానికి శాశ్వతంగా ముగింపు పలుకుతున్నాం అన్నారు మంత్రి లోకేష్.