గణేశ్ మండపాల వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ
NEWS Jul 20,2026 12:04 pm
హైదరాబాద్: సెప్టెంబర్ 17న తెలంగాణవ్యాప్తంగా అన్ని గణేశ్ మండపాల వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ, 'వందేమాతరం' గీతాలాపనకు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి పిలుపు.
'వందేమాతరం' గీతానికి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు.
మూసాపేట్ పుల్లారెడ్డి పాఠశాలలో జరిగిన సమావేశంలో 32 కేంద్రాల నుంచి 64 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
యువతలో దేశభక్తి, సాంస్కృతిక విలువలు, సనాతన ధర్మంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యమని సమితి వెల్లడి.
సంత్ రవిదాస్ 650వ జయంతి, అశోక్ సింఘాల్ జయంతిని ఘనంగా నిర్వహించాలని నిర్ణయం.
వినాయక ఉత్సవాల ఏర్పాట్లలో ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకోవాలని నిర్వాహకులకు సూచన.
ఉత్సవాలపై జరిగే దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలని పిలుపు.
మండపాలకు ఉచిత విద్యుత్, స్థానిక సంస్థల నుంచి నిధుల కేటాయింపు, పోలీసుల వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్.
డీజేలకు దూరంగా ఉండి, భజనలు, దేశభక్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని యువతకు విజ్ఞప్తి.
సెప్టెంబర్ 14 నుంచి వినాయక చవితి ఉత్సవాలు, 25న నిమజ్జన మహోత్సవం.
ఖైరతాబాద్ గణేశ్ ఈసారి 69 అడుగుల 'పంచముఖ సంకటహర మహా గణపతి' రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.