నెల గడిచినా యూనిఫాంలు అందలేదు.. విద్యార్థుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వీడాలి: PDSU
NEWS Jul 20,2026 03:40 pm
విద్యా సంవత్సరం ప్రారంభమై నెలకు పైగా గడిచినా నిర్మల్ జిల్లా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు అందకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని PDSU జిల్లా అధ్యక్షులు సింగరి వెంకటేష్ విమర్శించారు. పేద విద్యార్థులు పాత లేదా రంగు దుస్తులతో పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలను పంపిణీ చేయాలని, లేకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.