దరఖాస్తుల పరిష్కారంలో ఆలస్యం చేయొద్దు: అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్
NEWS Jul 20,2026 03:40 pm
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించి ప్రజల సమస్యలకు స్పందించాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్ఓ రాథోడ్ రమేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.