జలసిరితో నీటి సంరక్షణపై చైతన్యం
NEWS Jul 20,2026 01:40 pm
దిలావర్పూర్ (మం) సిర్గాపూర్ గ్రామ పంచాయతీలో ‘జలసిరి’ కార్యక్రమంలో భాగంగా గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీఓ గోవర్ధన్ మాట్లాడుతూ నీటి సంరక్షణ కోసం ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి వ్యవసాయ క్షేత్రానికి నీటి కుంట నిర్మించుకోవాలని సూచించారు. ఈ పనులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోందని, జాబ్ కార్డు ఉన్నవారు అర్హులని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.