కాలినడకన తిరుమల కొండెక్కిన పవన్ కల్యాణ్ అర్ధాంగి అన్నా లెజినోవా
NEWS Jul 18,2026 12:41 am
ఏపీ డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్ అర్ధాంగి అన్నా లెజినోవా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. శుక్రవారం ఆమె అలిపిరి నడకమార్గం ద్వారా కాలినడకన తిరుమల కొండకు చేరుకున్నారు. టీటీడీ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆమెకు శ్రీవారి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత అధికారులు ఆమెకు తీర్థప్రసాదాలను అందజేశారు.