రథం లాగిన AP సీఎం చంద్రబాబు
NEWS Jul 17,2026 05:45 pm
పూరీలో జగన్నాథ రథ యాత్ర గురించి అందరికీ తెలుసు. లక్షలాదిమంది ఈ యాత్రలో పాల్గొని తమ భక్తి ప్రపత్తులు చాటుకుంటూ ఉంటారు. ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలోని వెంకటపాలెంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో చేపట్టిన జగన్నాథ రథయాత్ర అందరినీ ఆకట్టుకుంది. సీఎం చంద్రబాబు స్వామివారి రథంలాగే ముందు పూరీ తరహాలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగన్నాథ రథం ముందు భాగంలో బంగారు చీపురుతో సీఎం ఊడ్చారు. అనంతరం జగన్నాథుడు, బలభద్ర, సుభద్రలు ఆశీనులైన రథాన్ని లాగారు.