మగనూరు మండలం కొల్పూర్ గ్రామంలో 3 రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై కె.వి. నరసింహ గ్రామ పంచాయతీ కార్యదర్శి భాస్కర్కు ఫోన్ చేసి తెలియజేసినా స్పందన లేదని ఆరోపించారు. పై అధికారులకు పలుమార్లు సమాచారం ఇచ్చినా చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు వాపోతున్నారు. వెంటనే తాగునీటి సమస్యను పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులు కోరుతున్నారు.