కనుల పండువగా రెండోరోజు పూరీ రథయాత్ర
NEWS Jul 17,2026 05:51 pm
ఒడిశాలోని పూరీలో జగన్నాథుని రథయాత్ర రెండో రోజు వైభవంగా సాగింది. జై జగన్నాథ్ నినాదాల మధ్య బలభద్రుడు, సుభద్ర, జగన్నాథుడి రథాలను భక్తులు ముందుకు కదిలించారు. గురువారం శ్రీక్షేత్రం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర శుక్రవారం గుండిచా మందిరానికి చేరుకుంది. దేశవిదేశాలకు చెందిన లక్షల మంది భక్తులు ఇందులో పాల్గొన్నారు.