డైనోసార్ అస్థిపంజరంకు ₹482 కోట్లు!
NEWS Jul 16,2026 10:22 am
వేలంలో 'గస్' అనే డైనోసార్ అస్థిపంజరం న్యూయార్క్లోని సోత్బేస్ వేలం కేంద్రంలో రికార్డు స్థాయిలో 50.1 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 482 కోట్లు) అమ్ముడుపోయింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డైనోసార్ శిలాజంగా నిలిచింది. ఈ వేలంలో, 10 నిమిషాల వ్యవధిలోనే 7గురు పోటీదారుల మధ్య హోరాహోరీగా బిడ్డింగ్ సాగింది. ఈ అస్థిపంజరాన్ని 2021లో సౌత్ డకోటాలో కనుగొన్నారు. ఇందులో 183 శిలాజ ఎముకలు లభ్యమాయ్యయి. ఇది డైనోసార్ దేహంలో సుమారు 63% మాత్రమే.