టీటీడీకి ఒక్కరోజే రూ.96.98 కోట్ల విరాళాలు
NEWS Jul 15,2026 05:01 pm
కలియుగ వైకుంఠం తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. అదేటైంలో భక్తుల నుంచి ఆ ఏడుకొండలవాడికి భారీగా ముడుపులు అందుతున్నాయి. టీటీడీ ట్రస్టులకు భారీగా విరాళాలు రావడంతో అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో రూ 96.98 కోట్ల విరాళాలు అందాయి. ఆన్లైన్ ద్వారా విరాళాలు సమర్పించారు 2,354 మంది దాతలు. ఆఫ్లైన్ ద్వారా విరాళాలు సమర్పించారు 106 మంది దాతలు.