అంత్యక్రియలకు ప్రభుత్వ లాంఛనాలను
తిరస్కరించిన ముద్రగడ కుటుంబం
NEWS Jul 15,2026 01:01 pm
ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల విషయంలో కూటమి ప్రభుత్వానికి.. ముద్రగడ కుటుంబసభ్యులు షాకిచ్చారు. అంత్యక్రియలకు ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదని తెలిపారు. ఈరోజు (జులై 15) సాయంత్రం కిర్లంపూడిలోనే ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు జరుపుతామని కుటుంబసభ్యులు ప్రకటించారు.