ముంబై ఆస్పత్రి నుంచి పవన్ డిశ్చార్జ్
NEWS Jul 15,2026 12:17 pm
ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ నెల 10న ప్రముఖ స్పోర్ట్స్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దిన్షా పార్థీవాలా నేతృత్వంలో కుడి భుజానికి సర్జరీ జరిగింది. 4 రోజుల విశ్రాంతి అనంతరం హైదరాబాద్లోని తన నివాసానికి చేరుకున్న పవన్, వైద్యుల సూచన మేరకు మరికొన్ని రోజులు విశ్రాంతి తీసుకోనున్నారు. ప్రతిరోజూ ఫిజియోథెరపీ చేయించుకోవాలని, కుడి భుజం పూర్తిగా కోలుకున్న తర్వాత ఎడమ భుజానికి కూడా సర్జరీ అవసరమని వైద్యులు సూచించినట్లు సమాచారం.