పాల్వంచ పట్టణంలోని శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని విలువ పూలమాలలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వినయ్ చార్యులు మాట్లాడుతూ.. భక్తులు ఆలయానికి పోటెత్తారని తెలిపారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. పూజా కార్యక్రమంలో భక్తులు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.