జాతీయ అవార్డు గ్రహీత రాహుల్కు సన్మానం
NEWS Jul 14,2026 01:06 pm
జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్న ఐటీడీఏ పీవో రాహుల్ ఐఏఎస్ను పీఆర్టీయూటీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బి. రవి, ప్రధాన కార్యదర్శి వై. సంగమేశ్వరరావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. మిగిలిన సీఆర్టీలను తిరిగి విధుల్లోకి తీసుకునేలా చర్యలు తీసుకుంటామని పీవో రాహుల్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బి. హీరాలాల్, రఘు, ప్రతాప్ సింగ్, బన్సీలాల్ తదితరులు పాల్గొన్నారు.