MJPVC బలోపేతానికి ముందుకు రావాలి
NEWS Jul 13,2026 07:04 pm
నారాయణపేట జిల్లా రాఘవేంద్ర కాలనీలో ఎంజెపీవీసీ (MJPVC) మక్తల్ అసెంబ్లీ అధ్యక్షుడు సంగోళ్ల అశోక్ కుమార్ అధ్యక్షతన కార్యవర్గ సంయుక్త సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు ముద్దు నవ్య శ్రీ, విశిష్ట అతిథిగా జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి విజయ్ కుమార్ పాల్గొన్నారు. సంస్థ బలోపేతానికి ప్రజలు పెద్ద ఎత్తున ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కెవి నరసింహ, కె. అంజప్పతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.