SIR పారదర్శకంగా నిర్వహించాలి
NEWS Jul 14,2026 01:26 pm
పినపాక నియోజకవర్గంలో SIR ప్రక్రియను పారదర్శకంగా, ప్రజలకు ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని మాజీ జెడ్పీటీసీ పాల్వంచ దుర్గ కోరారు. బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి సర్వే చేయాలని, రైతులు, కూలీలకు అనుకూల సమయంలో వివరాలు నమోదు చేయాలని సూచించారు. జియో ట్యాగింగ్ అమలు చేసి, DSE జాబితాను అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉంచాలని ఆమె డిమాండ్ చేశారు.