ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుడి భుజానికి సర్జరీ జరగడంతో ఆయన సతీమణి అన్నా కొణిదెల భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. శారీరక నొప్పికంటే జీవితంలో ఎన్నో కష్టాలను భరించిన పవన్, నొప్పి భరించలేని పరిస్థితిలోనే తన బాధను బయటపెడతారని చెప్పారు. ప్రస్తుతం తన దృష్టంతా ఆయన ఆరోగ్యంపైనే ఉందని, పూర్తిగా కోలుకునే వరకు జాగ్రత్తగా చూసుకుంటానని తెలిపారు. ముంబైలో పవన్కు భుజానికి సర్జరీ జరిగింది. ఆయన కోలుకుంటున్నారని, 4 నెలల్లో పూర్తిస్థాయిలో కోలుకునే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు.