భారీ ఎత్తున ఛలో ఐటీడీఏ కార్యక్రమం
NEWS Jul 13,2026 02:20 pm
పినపాక మండలం నుంచి తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం, సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన చలో ఐటీడీఏ కార్యక్రమానికి గిరిజనులు భారీగా తరలివచ్చారు. ఈ-బయ్యారం క్రాస్రోడ్డులో ర్యాలీ నిర్వహించి తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయానికి బయలుదేరిన గిరిజనులు డిమాండ్లు నెరవేరే వరకు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి దుబ్బ గోవర్ధన్, మడివి రమేష్తో పాటు పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.