ఫారెస్ట్ అధికారులు–పోడు రైతుల మధ్య వాగ్వాదం
NEWS Jul 13,2026 02:18 pm
పినపాక మండలం బోటిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని బంధగిరినగరంలో ఫారెస్ట్ అధికారులు, పోడు రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోడు భూముల విషయంలో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు సమాచారం. ఘటనపై అటవీ శాఖ జిల్లా స్థాయి అధికారులు స్పందించి పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.