భద్రాచలం గోదావరి వంతెనకు 61 ఏళ్లు
NEWS Jul 13,2026 02:17 pm
భద్రాచలం వద్ద గోదావరి నదిపై నిర్మించిన చారిత్రాత్మక రహదారి వంతెన ప్రారంభమై 61 సంవత్సరాలు పూర్తయ్యాయి. 1959లో అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి రూ.70 లక్షల వ్యయంతో శంకుస్థాపన చేయగా, 1965 మే 13న రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రారంభించారు. గోదావరిపై తొలి రహదారి వంతెనగా గుర్తింపు పొందిన ఈ వంతెన ఆరు దశాబ్దాలుగా ప్రాంత ప్రజలకు కీలక రవాణా మార్గంగా సేవలందిస్తోంది.