కళ్యాణి నర్సరీని సందర్శించిన బాలు నాయక్
NEWS Jul 13,2026 02:16 pm
కొత్తగూడెం రామవరం ప్రాంతంలోని కళ్యాణి నర్సరీని ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ సందర్శించారు. నర్సరీలోని పచ్చని వాతావరణం, మొక్కల పెంపకాన్ని పరిశీలించి ఆనందం వ్యక్తం చేసారు.ఆయన మాట్లాడుతూ, నర్సరీలో మొక్కల పెంపకం ఎంతో చక్కగా ఉందని ప్రశంసించారు.కళ్యాణి కుమారుడు మూగజీవుల పట్ల చూపుతున్న ప్రేమ, వాటి సంరక్షణకు చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు పెంచాలని సూచించారు.