శ్రీరామాయణ పారాయణదారుగా ఎస్టీజీ కృష్ణమాచార్యులకు పదోన్నతి
NEWS Jul 12,2026 12:45 pm
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో గ్రేడ్-2 శ్రీరామాయణ పారాయణదారు పోస్టులో విధులు నిర్వహిస్తున్న శ్రీ ఎస్టీజీ కృష్ణమాచార్యులకు గ్రేడ్-1 శ్రీరామాయణ పారాయణదారుగా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు దేవస్థానం ఈవో దామోదర్ రావు పదోన్నతి ఉత్తర్వులను కృష్ణమాచార్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు అధికారులు, సహోద్యోగులు అభినందనలు తెలిపారు.