'ఛలో ఐటీడీఏ' విజయవంతం చేయాలని సీపీఎం పిలుపు
NEWS Jul 12,2026 12:43 pm
ఈ నెల 13న నిర్వహించే 'ఛలో ఐటీడీఏ' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు అన్నవరపు కనకయ్య పిలుపునిచ్చారు. పినపాక మండలం విప్పలగుంపు, మొద్దులాగూడెం గ్రామాల్లో నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు నిమ్మల వెంకన్న, మండల కార్యదర్శి గోవర్ధన్, నాయకులు మడివి రమేష్, దడిగల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.