BRS ఆరోపణలు నిరాధారం: నరేష్ కుమార్
NEWS Jul 12,2026 12:45 pm
చింత్రియాల కాలనీ గ్రామపంచాయతీ భవన ప్రారంభోత్సవంపై బీఆర్ఎస్ సర్పంచ్, ఉపసర్పంచ్ చేసిన ఆరోపణలు అర్థరహితమని యూత్ కాంగ్రెస్ అశ్వాపురం మండల ఉపాధ్యక్షుడు గొల్లపల్లి నరేష్ కుమార్ అన్నారు. కార్యక్రమ షెడ్యూల్ను అధికారులు ముందుగానే ప్రకటించి సమాచారం ఇచ్చారని, దానిని వారే సోషల్ మీడియాలో పంచుకున్నారని పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాలతో హాజరుకాలేక కార్యక్రమం రద్దు చేయాలని అధికారులపై ఒత్తిడి తేవడం సరికాదని విమర్శించారు.