జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడిగా రామకృష్ణ యాదవ్
NEWS Jul 12,2026 12:44 pm
జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా జెట్టి రామకృష్ణ యాదవ్ నియమితులయ్యారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ నియామక పత్రాన్ని అందజేశారు. యాదవుల హక్కుల పరిరక్షణ, విద్య, ఉపాధి, సంక్షేమ పథకాల అమలుకు కృషి చేస్తానని జెట్టి రామకృష్ణ తెలిపారు. ఆయన నియామకాన్ని జిల్లా యాదవ సంఘాల నాయకులు, కార్యకర్తలు స్వాగతిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.