విశాఖలో తెల్లవారుజామున భూప్రకంపనలు
NEWS Jul 12,2026 09:30 am
విశాఖలో నేటి తెల్లవారుజామున భూప్రకంపనలు సంభవించాయి. విశాఖలోని మాధవధార, సీతమ్మధార, గాజువాక, పెదవాల్తేరు, ఈస్ట్ పాయింట్ కాలనీలతో పాటు పలు ప్రాంతాలలో భూమి కనిపించింది. నిద్రలో ఉన్న జనాలు.. భయపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇళ్లలో ఫ్యాన్లు ఊగడం, వీధిలైట్లు మిణుకుమిణుకుమంటూ కనిపించడంతో ఆందోళన చెందారు. రిక్టర్ స్కేల్ పై భూకంపం తీవ్రత 4.5 గా నమోదు అయినట్టు తెలుస్తోంది. అటు విజయనగరం జిల్లాలోనూ పలు చోట్ల భూమి కంపించినట్లు సమాచారం.