పాఠశాలలో నూతన వంటగది ప్రారంభం
NEWS Jul 11,2026 03:11 pm
మాసాయిపేట గ్రామ ప్రాథమిక పాఠశాలలో నూతనంగా నిర్మించిన వంటగదిని వెల్లుల్ల గ్రామ సర్పంచ్ గూడూరు తిరుపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మెరుగైన మధ్యాహ్న భోజన సౌకర్యాలు అందేలా ఈ వంటగది ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో విద్యాధికారి కనకధార, వెల్లుల్ల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, ఉపసర్పంచ్ శేఖర్, ఈవో నారాయణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగాప్రసాద్, ఉపాధ్యాయులు మల్లేశం తదితరులు పాల్గొన్నారు.