బ్రాహ్మణికి మరో అరుదైన గౌరవం!
NEWS Jul 11,2026 11:09 am
ఫార్చ్యూన్ ఇండియా ప్రకటించిన '100 మంది అత్యంత ప్రభావశీల మహిళల' లిస్టు 2026లో చోటు బ్రాహ్మణి దక్కించుకున్నారు. వ్యాపార రంగంలో ఆమె నాయకత్వానికి గుర్తింపుగా ఈ గౌరవం లభించింది. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ స్పందిస్తూ, బ్రాహ్మణి విజయం గర్వకారణమని, మరింత మందికి స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. సీఎం చంద్రబాబు కూడా ఆమెను అభినందిస్తూ, ఈ గుర్తింపు ఆమె అంకితభావం, నాయకత్వానికి నిదర్శనన్నారు. తెలుగు యువతులకు బ్రాహ్మణి ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు.