కొండగట్టు అంజన్న సేవలో మంత్రి అడ్లూరి
NEWS Jul 11,2026 11:10 am
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, క్షేత్రపాలకుడైన బేతాళ స్వామిని దర్శించుకున్నారు. అర్చకులు వేదాశీర్వచనం అందించగా, ఈవో అంజనారెడ్డి శాలువాతో సత్కరించారు. ఎస్సై సందీప్, ఏఎస్ఐ రమణారెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ చెక్కిళ్ళ అశోక్, రాజేందర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.