SIR పేరుతో OTP అడిగితే చెప్పొద్దు
NEWS Jul 10,2026 11:20 pm
SIR-2026 ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలపై హైదరాబాద్ పోలీసులు, ఎన్నికల అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ఓటరు వివరాల ధృవీకరణ పేరుతో ఫోన్ చేసి ఓటీపీ, బ్యాంకు వివరాలు, వ్యక్తిగత సమాచారం అడిగే వారిని నమ్మవద్దని సూచించారు. ఎన్నికల అధికారులు ఎప్పటికీ ఫోన్ ద్వారా ఓటీపీలు లేదా బ్యాంకు వివరాలు అడగరని స్పష్టం చేశారు. అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే 1930 సైబర్ హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయాలని, ఓటర్ల సేవల కోసం భారత ఎన్నికల సంఘం అధికారిక వేదికలనే వినియోగించాలని సూచించారు.