వ్యాధులను అరికట్టాలి: మున్సిపల్ చైర్మన్
NEWS Jul 10,2026 11:23 pm
సీజనల్ వ్యాధులను అరికట్టాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మెట్పల్లి మున్సిపల్ ఛైర్మన్ మైలారపు లింబాద్రి అన్నారు. పట్టణంలోని 17వ వార్డులో డ్రైనేజీల్లో ఆయిల్ బాల్స్, యాంటీ లార్వా స్ప్రే, బ్లీచింగ్ పౌడర్ వేయించారు. హెల్త్, మున్సిపల్ శాఖలు సమన్వయంతో పనిచేసి వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు. మేనేజర్ వెంకటలక్ష్మి, కౌన్సిలర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.