మెట్పల్లిలో కొత్త కోర్టు భవనాలకు వినతి
NEWS Jul 10,2026 11:24 pm
మెట్పల్లి పట్టణంలో కోర్టుల కోసం 5 నూతన భవన నిర్మాణం చేపట్టాలని కోరుతూ బార్ అసోసియేషన్ ప్రతినిధులు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఎస్. గోవర్ధన్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతం ఉన్న కోర్టు భవనం శిథిలావస్థకు చేరిందని, దాని స్థానంలో ఆధునిక సౌకర్యాలతో కొత్త భవనం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కోర్టుకు ఆనుకుని ఉన్న ఖాళీ ఎస్సారెస్పీ స్థలాన్ని న్యాయశాఖకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.