మెట్పల్లిలోని వెంకట్రావుపేట వద్ద జాతీయ రహదారి పక్కన మిషన్ భగీరథ ప్రధాన పైప్లైన్ గత కొన్ని రోజులుగా లీకవుతూ తాగునీరు రోడ్డుపై వృథాగా పారుతోంది. పలుమార్లు మరమ్మతులు చేసినప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. చిన్న లీకేజీలను నిర్లక్ష్యం చేస్తే పైప్ ఒక్కసారిగా పగిలి భారీగా నీరు ఎగసిపడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. వెంటనే శాశ్వత మరమ్మతులు చేపట్టి తాగునీటి వృథాను అరికట్టాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.